Homeగాసిప్స్శర్వా అటువైపు వెళ్ళిపోతున్నాడా?

శర్వా అటువైపు వెళ్ళిపోతున్నాడా?

శర్వా అటువైపు వెళ్ళిపోతున్నాడా?
శర్వా అటువైపు వెళ్ళిపోతున్నాడా?

యంగ్ హీరో శర్వానంద్ చాలా టాలెంటెడ్ అన్న పేరుంది. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించగల అరుదైన నటుల్లో శర్వానంద్ ఒకరు. అయితే కథల ఎంపికలో శర్వానంద్ ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. తన కెరీర్ మొత్తంలో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథలు ఎంచుకున్నవే తక్కువ. ఎప్పుడూ ఆఫ్ బీట్ కథలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన శర్వానంద్ ఇప్పుడు కెరీర్ లో లో-ఫేజ్ ఎదుర్కొంటున్నాడు. తను నటించిన లాస్ట్ మూడు సినిమాలు పడి పడి లేచె మనసు, రణరంగం, జాను సినిమాలు దారుణంగా బెడిసికొట్టాయి.

ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్నాడు కానీ అది కూడా కమర్షియల్ ఓరియెంటెడ్ చిత్రం కాదు. వ్యవసాయం, రైతుల కష్టాలు, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఫార్మింగ్ లో ఎలాంటి అద్భుతాలు చేసాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. పైగా నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ మొత్తం  పూర్తయింది. దాదాపు 10 రోజులు షూటింగ్ చేస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో శర్వానంద్ యూఎస్ వెళ్లడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. తిరిగి వచ్చేసరికి కరోనా ప్రభావం వల్ల షూటింగ్ లకు అంతరాయం కలిగింది.

- Advertisement -

ఇదిలా ఉంటే తెలుగు సినిమాల నుండి శర్వానంద్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక రెండు, మూడు సినిమాలు తమిళంలో చేసి ఆ తర్వాత తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తే ఫ్రెష్ గా అనిపిస్తుందని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాను ఓకే చేసాడు. జర్నీ తమిళ వెర్షన్ తర్వాత శర్వా తమిళంలో మళ్ళీ సినిమా చేయలేదు. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బాగా ఆడింది. తమిళంలో ఈ హీరో చేసిన సినిమా ఎలాగు తెలుగులోకి డబ్ అవుతుంది. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు కూడా దూరం కానట్లు ఉంటుందని ప్లాన్ చేసాడని తెలుస్తోంది. మరి శర్వా వేసిన ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All