ప్రభాస్ – షర్మిల ల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉండటంతో వాటిపై ఐదేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఆ తర్వాత ఆ వార్తలు ఆగిపోయాయి. కట్ చేస్తే తాజాగా ఆ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. దాంతో అవన్నీ గాలి వార్తలే అంటూ పోలీసులను ఆశ్రయించింది వై ఎస్ జగన్ సోదరి షర్మిల.
అసలు ప్రభాస్ ని నేను ఒక్కసారి కూడా చూడలేదని, కలవలేదని కానీ మా మధ్య అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయని అలాంటి చెడు రాతలు రాసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని పట్టుబడుతోంది షర్మిల. గతంలో ప్రభాస్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు , ఇక ఇప్పుడేమో షర్మిల ఫిర్యాదు చేసింది. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు .
- Advertisement -
English Title: Sharmila complaint against rumours
- Advertisement -