దక్షిణాదితో మోస్ట్ ఫేవరేట్ డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలని దక్షిణాది హీరోలతో పాటు ఉత్తరాది హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు. అలాంటి శంకర్ దర్శకత్వంలో మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం శంకర్ `ఇండియన్ 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్హాసన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది.
త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత శంకర్ – రామ్చరణ్ల కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయికి మించి ఓ భారీ చిత్రం తెరపైకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారట. గతంలో `భారతీయుడు 2`కు నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకొచ్చిన దిల్రాజు అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గారు. ఆ స్థానంలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ వదులుకున్నా శంకర్తో ఎలాగైనా సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. తాజాగా ప్రాజెక్ట్ని సెట్ చేయడం కోసం ఓ బిగ్ ప్రొడ్యూసర్ శంకర్తో మంతనాలు జరుపుతున్నారట. వన్స్ డీల్ సెట్టయితే అనౌన్స్మెంట్ రావడం ఇక లాంఛనమే అని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రామ్చరణ్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`తో పాటు `ఆచార్య`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.