తమిళ టాప్ దర్శకులు శంకర్, మణిరత్నం ప్రస్తుతం కంటెంట్ కోసం చేతులు కలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా విస్తృతమయ్యాక కంటెంట్ కు డిమాండ్ బాగా పెరిగింది. వెబ్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లను కూడా విరివిగా తెరకెక్కిస్తున్నారు. వీటికి ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో రిసెప్షన్ చాలా బాగుంది.
ఈ నేపథ్యంలో దీన్ని తమిళ దర్శకులు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. తమిళ దర్శకులు కొందరు ఒక గ్రూప్ గా అయ్యి రెయిన్ ఆన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను నెలకొల్పారు. మణిరత్నం దీనికి ఇనిషియేటివ్ తీసుకోగా ఈ గ్రూప్ లో ఇంకా తమిళ దర్శకుడు శంకర్, గౌతమ్ మీనన్, మురుగదాస్, మిస్కిన్, వసంత బాలన్ తదితరులు ఉన్నారు.
ఈ గ్రూప్ కు సంబంధించి మొదటి వెంచర్ గా ఒక చిత్రాన్ని రూపొందిస్తారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా విక్రమ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అది పూర్తయ్యాక ఈ బ్యానర్ లో సినిమాను రూపొందిస్తారు.