Homeగాసిప్స్దసరాకే ఫిక్స్ అంటున్న శేఖర్ కమ్ముల

దసరాకే ఫిక్స్ అంటున్న శేఖర్ కమ్ముల

దసరాకే ఫిక్స్ అంటున్న శేఖర్ కమ్ముల
దసరాకే ఫిక్స్ అంటున్న శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండి ఒక వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఫిదా చిత్రంతో అన్ని వర్గాలను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా, అక్కినేని నాగ చైతన్య హీరోగా, తెలంగాణ నేపథ్యంలోనే లవ్ స్టోరీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మరో నెల రోజులు చేస్తే షూటింగ్ పూర్తైపోతుంది. అయితే సడెన్ గా కరోనా వచ్చి షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు లేకుండా పోయాయి.

అయితే మరో నెల రోజుల్లో షూటింగ్ లు మొదలవుతాయన్న సంకేతాలు అందుతున్న నేపథ్యంలో అందరూ షూటింగ్ ల కోసం సిద్ధమవుతున్నారు. అయితే సినిమా రిలీజ్ లు ఎప్పుడనే దానిపై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే శేఖర్ కమ్ముల మాత్రం ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. వీలైనంత తొందరగా చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి దసరాకే సినిమాను అందివ్వాలని శేఖర్ కమ్ముల పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

లవ్ స్టోరీ పరిచయ టీజర్ తోనే విశేషంగా ఆకట్టుకుంది. ఈ కాంబినేషన్ పై మార్కెట్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాదాపు 20 కోట్లకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు  అమ్ముడైపోయినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All