యాక్షన్ స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ సినిమా సీటిమార్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేసాడు. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. గోపీచంద్ విరివిగా ప్రమోషన్స్ ను చేపడుతున్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
మరోవైపు ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫిక్స్ అయింది. సీటిమార్ థియేట్రికల్ రైట్స్ ను 11.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే కచ్చితంగా 12 కోట్లకు పైనే వసూలు చేయాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు.
సీటిమార్ తెలంగాణలో 215 థియేటర్లలో, ఆంధ్రప్రదేశ్ లో 350 థియేటర్లలో విడుదలవుతోంది. మణిశర్మ అందించిన సంగీతం మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మరి కబడ్డీ కూత గోపీచంద్ కు హిట్ తీసుకొస్తుందేమో చూడాలి.