Homeటాప్ స్టోరీస్భీమ్లా దెబ్బకు మరో యంగ్ హీరో తప్పుకున్నాడు

భీమ్లా దెబ్బకు మరో యంగ్ హీరో తప్పుకున్నాడు

భీమ్లా దెబ్బకు మరో యంగ్ హీరో తప్పుకున్నాడు
భీమ్లా దెబ్బకు మరో యంగ్ హీరో తప్పుకున్నాడు

నాల్గు రోజుల క్రితం వరకు కూడా భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25 న వస్తుందని ఎవరు అనుకోలేదు. ఎలాగూ బరిలో లేదుకదా అని వరుస పెట్టి చిన్న , పెద్ద సినిమాలు ఫిబ్రవరి 25 న వచ్చేందుకు ఫిక్స్ అయ్యాయి. ప్రమోషన్స్  , సెన్సార్ కార్య క్రమాలు ఇలా అన్ని జరుపుకొని థియేటర్స్ లోకి రావడమే అన్నట్లు సిద్ధమయ్యారు.

కానీ భీమ్లా నాయక్ సడెన్ ఎంట్రీ ఇవ్వడం తో ఏంచేయాలో తెలియని పరిస్థితికి వెళ్లారు. మరో ఆలోచన లేకుండా బరి నుండి తప్పుకుంటున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ గని , శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు మూవీస్ తమ రిలీజ్ ను వాయిదా వేసుకోగా..తాజాగా మరో యంగ్ హీరో తన సినిమాను వాయిదా వేసుకున్నాడు.

- Advertisement -

రాజావారు రాణిగారు‘ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ‘సెబాస్టియన్ PC 524’ మూవీ చేసాడు. రాజు – ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం సరసన నాయికలుగా నువేక్ష .. కోమలి ప్రసాద్ కనువిందు చేయనున్నారు. ఒక ముఖ్యమైన పాత్రలో రోహిణి కనిపించనుంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుండడంతో ‘సెబాస్టియన్ PC 524’ వాయిదా వేసుకున్నారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All