పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్నతాజా చిత్రం `వకీల్సాబ్`. పొలిటికల్ ఎంట్రీ తరువాత దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత పవన్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ రిలికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు.
`సత్యమేవ జయతే..` అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ అద్భుతమైన స్వరాలు అందించారు. ఈ పాటని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర, తమన్ ఆలపించారు. పాటలోని `జన జన జన.. జనగణమున కలగలిసిన మనిషిరా.. ` అంటూ సాగే పదాలని బట్టి చూస్తుంటే పవన్స్టార్ పొలిటికల్ మైలేజీని పెంచడంలో భాగంగానే రాసినట్టుగా కనిపిస్తోంది. ఈ పాటని పొలిటికల్గా వాడుకునే క్రమంలో రూపొందించినట్టుగా తెలుస్తోంది.
పవర్ స్టార్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులతో తెరకెక్కించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపై పవన్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొనడంతో ఆ స్థాయికి ఏమాత్రం సినిమా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.