కరోనా సెకండ్ వేవ్ మరోసారి చాలా మంది జీవితాలను తలక్రిందులు చేసి వెళ్ళిపోయింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడంతో సినిమా షూటింగ్స్ ను మొదలుపెట్టారు. థియేటర్స్ ను తెరుచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కానీ ఈ నెలలో కొత్త సినిమాలు విడుదలవ్వడం కష్టమే.
ఆగస్ట్ నుండి తెలుగు సినిమాల విడుదలలు మొదలవుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే ఈలోగా మరో వార్త బయటకు వచ్చింది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఓటిటిలో విడుదల అవ్వదని, థియేటర్లలోనే విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు. నిర్వాణ సినిమాస్ ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసింది.
తాజా సమాచారం ప్రకారం జులై 30 న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి తెలుగు చిత్రంగా తిమ్మరులు నిలుస్తుంది. శరన్ కొప్పిశెట్టి ఈ లీగల్ థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.