మొదట చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నటుడు సత్యదేవ్ క్రమంగా ఇప్పుడు హీరో అయ్యాడు. మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పుడు తనకంటూ కొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం సత్యదేవ్ నటించిన లేటెస్ట్ సినిమా తిమ్మరుసు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న తిమ్మరుసు విడుదల కాబోతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడ్డాక విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇక సత్యదేవ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమా గురించి స్పందించాడు. “లాక్ డౌన్ కారణంగా జనాలకు వరల్డ్ సినిమా చూసే అవకాశం ఎక్కువ దక్కింది. ఏడాది క్రితం కంటే ఇప్పుడు వారు కొంత మెచ్యూర్ అయ్యారు. అయితే అది మంచికే జరిగింది. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాలకు ఆదరణ పెరిగింది. కొత్త తరం దర్శకులు కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు” అని సత్యదేవ్ అన్నాడు.