సత్యదేవ్ హీరోగా దూసుకుపోతున్నాడు. గతేడాది ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో మనల్ని అలరించాడు సత్యదేవ్. అటు ఓటిటిలో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సత్యదేవ్ హీరోగా తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రకటించాడు సత్యదేవ్.
గోపి గణేష్ దర్శకత్వంలో గాడ్సే అనే చిత్రాన్ని చేయనున్నాడు. గతంలో గోపి గణేష్, సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ చేసాడు. సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు సత్యదేవ్.
గోపి గణేష్ అన్నతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు. ఇది ఒక విభిన్న తరహా చిత్రమని తెలుస్తోంది. గాడ్సేకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. సత్యదేవ్ నటిస్తోన్న ఈ మూడు సినిమాలు కూడా 2021లోనే విడుదల కానున్నాయి. మరి ఈ చిత్రాలతో తన స్టార్డంను మరింత పెంచుకుంటాడేమో చూడాలి.