Homeన్యూస్షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట

షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట

షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట
షూటింగ్ చివరి స్టేజ్ లలో సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశల్లో ఉంది. సర్కారు వారి పాట టీమ్ రీసెంట్ గా స్పెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న విషయం తెల్సిందే. అయితే ఎక్కువ బ్రేక్ లేకుండా ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ మొదలుపెట్టేసారు. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ దాదాపుగా పూర్తైపోతుందని తెలుస్తోంది. మరికొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ తో కలిపి మరో రెండు వారాల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట మొదటి టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ను షురూ చేయాలని భావిస్తున్నారు. సర్కారు వారి పాట సాంగ్ అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All