సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం చిత్రంలోని చివరి సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఈ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ పాట షూటింగ్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా తాలూకా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇక ఈ మాస్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.
The sets were a blast today with Super? @urstrulyMahesh at his Massiest best ?
People will go ballistic in Theatres for this MASS song?#SarkaruVaariPaata#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/lwbF6xBlYi
— BA Raju's Team (@baraju_SuperHit) April 18, 2022