మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా, లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కీలక పాత్రలో ప్రొఫెసర్ భారతిగా కనిపించబోతున్నారు. `కొడుకు దిద్దిన కాపురం` తరువాత విజయశాంతి, మహేష్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా వుండబతోందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటల్ని రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సోమవారం సాయంత్రం మూడవ పాటని విడుదల చేశారు. `హీ ఈజ్ సో క్యూట్..` అంటూసాగే ఈ పాటని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. మహేష్ని టీజ్ చేస్తూ సాగే ఈ పాటలో రష్మిక రెచ్చిపోయి నటించినట్టుగా రనిపిస్తోంది. `అబ్బబ్బబ్బా… అబ్బా యెంత ముద్దుగున్నాడే.. అంటూ మహేష్ చుట్టూ తిరుగుతూ ఆలపట్టించడం ఆకట్టుకుంటోంది. రష్మిక పాట కోసం ఎదురుచూస్తున్న ఆమె ఫ్యాన్స్కి ఈ పాట యమ కిక్నిస్తోంది. యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేసిన ఈ పాట ట్విట్టర్లో షేర్ అవుతూ వైరల్ అవుతోంది.
రష్మిక ఈ పాటలో వేసిన స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి. తనకు డ్యాన్స్ రాదు రాదంటూనే ఈ పాటలో ఓ రేంజ్లో అదరగొట్టేయడం, మహేష్, రష్మికల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ఏస్థాయిలో వుండబోతోందనేది ఈ పాట ద్వారా స్పష్టమౌతోంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ హుషారెత్తే గీతాన్ని మధుప్రియ ఆలపించింది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది.