సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ సినిమాగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు సెంటర్ స్పెషల్ సెట్ ను వేసి సినిమాకి కీలకమైన సీన్లను షూట్ చేస్తున్నారు. ఈ నెల 13 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండవ వారంతో పూర్తి కానుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. నవంబర్ రెండవ వారం నుండి నిర్మాణానంతర కార్యక్రమాలు జరిపి డిసెంబర్ కల్లా సినిమాను సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
అక్కడినుండి చిత్ర ప్రమోషన్స్ లో యూనిట్ బిజీ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా సమర్పిస్తున్నారు.
- Advertisement -