Homeగాసిప్స్అల్లు అర్జున్ ఎఫెక్ట్ - నవంబర్ నుండే సరిలేరు ప్రచారం

అల్లు అర్జున్ ఎఫెక్ట్ – నవంబర్ నుండే సరిలేరు ప్రచారం

Sarileru Neekevvaru rescheduling promotional campaign
Sarileru Neekevvaru rescheduling promotional campaign

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి నిజంగా మాట్లాడుకుంటే ఇంకా ప్రచారం ఏం మొదలుకాలేదు. ఏదో ఒక పాట రిలీజ్ చేసారు కానీ అది అంత సీరియస్ గా తీసుకుని చేసింది కాదు. అది కాకుండా మరో రెండు, మూడు పోస్టర్లు మాత్రమే వదిలారు. ఇంకా సంక్రాంతికి రిలీజ్ ఉండడంతో అనిల్ రావిపూడి చెప్పినట్లు ప్రమోషన్స్ కు ఇంకా చాలా టైమ్ ఉంది. అసలైతే డిసెంబర్ నుండి ఈ చిత్ర ప్రమోషన్స్ ను అగ్రసివ్ గా ప్లాన్ చేసారు. వారానికి ఒక ప్రమోషనల్ మెటీరియల్ తో ఇప్పటికే ప్లాన్ రెడీ చేసారు.

ఇక జనవరి నుండి డే టు డే ప్రమోషనల్ యాక్టివిటీస్ కు సంబంధించిన షెడ్యూల్ సిద్ధంగా ఉంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుండడంతో దాదాపు 11వ తేదీ వరకూ మీడియాలో ఈ చిత్రం మార్మోగిపోయేలా అన్ని ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయి. నిజానికైతే ఒక స్టార్ హీరో చిత్రానికి ఇది చాలా ఎక్కువ. ఇంత పబ్లిసిటీ కూడా కోరుకోరు టాప్ హీరో అభిమానులు. కానీ ఈసారి సంక్రాంతికి పోటీ విపరీతంగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరు టీమ్ ప్రమోషన్స్ విషయంలో అగ్రసివ్ గా వెళ్లాలని నిర్ణయించుకుంది.

- Advertisement -

అయితే వీళ్ళ కంటే చాలా ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ పై ఒత్తిడి పడింది. ఇప్పటికే రెండు పాటలని వదిలిన అల వైకుంఠపురములో టీమ్ ఆ రెండు పాటలు సూపర్ హిట్ అవ్వడంతో గాల్లో తేలిపోతోంది. ఇదే ఊపులో నవంబర్ లో మరింత ప్రమోషనల్ మెటీరియల్ ను సిద్ధం చేస్తున్నారు టీమ్. ఈ నెలలో ఒక టీజర్, మూడో పాట విడుదల చేస్తారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో ఇంత దూకుడుగా ఉండడంతో సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా ప్రమోషనల్ స్ట్రాటజీ మారుద్దామా అన్న ఆలోచనలో ఉన్నారట.

డిసెంబర్ నుండి మొదలుపెట్టే బదులు నవంబర్ సెకండ్ వీక్ నుండే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ముందుగా చిత్ర టీజర్ ను వదిలి దాని ద్వారా అల వైకుంఠపురములో టీమ్ కు ప్రతి దాడి చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే విపరీతమైన హైప్ ను తెచ్చుకున్న అల వైకుంఠపురములో టీమ్ పై ఒత్తిడి పెంచడం అంత సులువైన విషయమేం కాదు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ ను మహేష్, అనిల్ రావిపూడి వద్దకు తీసుకెళ్ళిందిట ప్రమోషనల్ టీమ్. వాళ్ళు ఇంకా దాన్ని ధృవీకరించాల్సి ఉంది.

మరోవైపు మహేష్ బాబు, అనిల్ రావిపూడి అండ్ కో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం కేరళ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ప్రశాంతంగా షూటింగ్ ముగించుకుని వచ్చి అప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటారో లేక ఒత్తిడికి తలొగ్గి ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం అల వైకుంఠపురములో టీమ్ దే పైచేయిగా కనపడుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All