Homeగాసిప్స్దేవిపై ఒత్తిడి పెంచుతోన్న సరిలేరు.. టీమ్

దేవిపై ఒత్తిడి పెంచుతోన్న సరిలేరు.. టీమ్

దేవిపై ఒత్తిడి పెంచుతోన్న సరిలేరు.. టీమ్
దేవిపై ఒత్తిడి పెంచుతోన్న సరిలేరు.. టీమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం మహర్షి వంటి హిట్ తర్వాత చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో మహేష్ అండ్ కో వీలైనంత సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. సినిమాకు మరీ ఎక్కువ హైప్ తీసుకురావడం మంచిది కాదని మహేష్ భావిస్తున్నాడు. ఇంతకు ముందు మహేష్ భారీగా హడావిడి చేసి రిలీజ్ చేసిన ఆగడు సినిమా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటినుండి మహేష్ తన సినిమా గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా మహేష్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. వీలైనంత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర మాత్రం వీలైనంతగా ఈ సినిమా అదిరిపోతుందనే నమ్మకాన్ని మహేష్ అభిమానుల్లో కలగజేస్తున్నారు. ఈ సినిమా చూసి మీరు నవ్వి నవ్వి కడుపు చెక్కలవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని కలగజేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పోటీగా అదే రోజు విడుదలవుతున్న అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో కేక పుట్టిస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ముందు ఇలా పాటలు విడుదల చేస్తున్నారు అని తెల్సినా సరిలేరు నీకెవ్వరు టీమ్ లైట్ తీసుకుంది. సమజవరగమన, రాములో రాముల సాంగ్స్ ఓ రేంజ్ లో సక్సెస్ కావడంతో బజ్ అంతా అటువైపు వెళ్ళిపోయింది. గత నెల రోజులుగా ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్లే ఎక్కువున్నారు. ఏదో మాట వరసకి సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంత ఎఫెక్ట్ ఊహించని సరిలేరు టీమ్ ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది.

- Advertisement -

ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఒక పాట ట్యూన్ చేయమని సరిలేరు నీకెవ్వరు టీమ్ దేవి శ్రీ ప్రసాద్ పై ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో ఇప్పటికే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. తమన్నా తన అందచందాలతో పిచ్చెక్కిస్తుందని అంటున్నారు. అయితే ఈ పాటతో పాటు ఇప్పుడు మరొక పాటను కూడా కంపోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి షూటింగ్ మొదట్లోనే టీమ్ కు ఈ ఆలోచన వచ్చింది. అయితే అప్పుడు అనవసర హంగులు ఎందుకులే అనుకుని వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు అల వైకుంఠపురములో ప్రమోషన్స్ హడావిడి వల్ల వీళ్ళు కూడా చేయాల్సి వస్తోంది. ఈ రెండో స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే మెరవనుందని టాక్ వినిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఈ పాటకు తన పాత ఐటెం నంబర్ల తరహాలో అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.

మహేష్ బాబు సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. జనవరి 12న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All