`పరుగు` సినిమాతో కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సప్తగిరి కమెడియన్గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత తను హీరోగా మారిన విషయం తెలిసిందే. `సప్తగిరి ఎక్స్ప్రెస్` మూవీతో సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా నిర్మాతకు లాభాల్ని అందించడంతో అతనితో వరుసగా సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తిని చూపించారు.
అయితే ఆ తరువాత చేసిన చిత్రాలేవీ ఆకట్టుకోలేకపోవడంతో కొంత విరామం తీసుకున్న సప్తగిరి సైలెంట్గా ఓ బహుబాషా చిత్రానికి రెడీ అయిపోయాడు. సప్తగిరి నటిస్తున్న తాజా థ్రిల్లర్ `ఎయిట్`. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేసింది. యూనివర్సల్ కథాంశంతో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా సప్తగిరి మార్కు వినోదాన్ని జోడించి తెరకెక్కించబోతున్నారు. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలో ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడించనున్నారు.