యష్ నటిస్తున్న తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. `కేజీఎఫ్ చాప్టర్ 1`కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. తొలి పార్ట్ సంచలన విజయం సాధించడంతో చాప్టర్ 2పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
20 శాతం చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇందులో కీలకమైన అధీరా పాత్రలో బ్యాడ్మెన్గా బాలీవుడ్ హీరో సంజయ్దత్ నటిస్తున్నారు. ఇండియా ప్రధాన మంత్రిగా రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటిస్తోంది. సంజయ్దత్, యష్ల మధ్య వచ్చే హైఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలు మూవీ లవర్స్కు ఫీస్ట్గా వుండనున్నాయని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఇటీవల క్యాన్సర్లో బాధపడుతున్న సంజయ్ దత్ ఆసుపత్రిలో చేశారు.
దీంతో `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సంజయ్ దత్కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని, అయితే ఆయన అధీరా పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సి వుందని తెలిసింది. క్యాన్స్ర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంజయ్దత్ తిరిగి రావాలంటే ఎత లేదన్నా మూడు నెలలు పడుతుందని, ఆ తరువాతే సంజయ్ ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్లో పాల్గొంటారని `కేజీఎఫ్ చాప్టర్ 2` చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అంటే ఈ మూవీ బయటికి రావాలంటే మరో మూడు నెలలు వేచి చూడక తప్పదన్నమాట.