సంజయ్దత్ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ ఎందుకు వెళుతున్నారు? .. ఆయనతో మాన్యత కూడా వెళ్లడానికి ప్రత్యేక కారణం ఏంటీ? అన్నది బాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సంజయ్దత్ పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్లతో పాటు `కేజీఎఫ్ చాప్టర్ 2`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అధీరాగా ప్రధాన విలన్ పాత్రలో సంజయ్ కనిపించబోతున్నారు. ఇందు కోసం ఆయనకు సంబంధించిన కొంత షూటింగ్ బ్యాలెన్స్గా వుంది.
ఇదే సమయంలో సంజయ్కి లంగ్ క్యాన్సర్ అని, అది ఫోర్త్ స్టేజ్లో వుందని, ఆయనకు అత్యవసరంగా కీమోథెరపి చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన షూటింగ్లని పక్కన పెట్టి తొలి రౌండ్ కీమో థెరపి చేయించుకున్నారు. రెండవ రౌండ్ కీమోథెరపీకి సమయం వుండటంతో ఆయన తన భార్యతో కలిసి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ వెళుతున్నారు.
కరోనా రారణంగా లాక్ డైన్ విధించడంతో ఆయన పిల్లలు ఇద్దరు దుబాయ్లోనే వుండిపోవాల్సి వచ్చింది. దాదాపు ఐదు నెలలుగా వారిని సంజయ్ దంపతులు కలవలేకపోయారు. ఈ సమయంలో టైమ్ చిక్కడంతో వారిని కలవాలని సంజయ్ దంపతులు దుబాయ్ బాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండవ దశ కీమో థెరపీ తరువాత సంజయ్ తను అంగీకరించిన శంషేరా, కేజీఎఫ్ చాప్టర్ 2, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, పృథ్వీరాజ్ చిత్రాలకు డేట్స్ కేటాయిస్తారట.