సంజయ్ దత్ మెడకు ప్రస్థానం చిచ్చు
తెలుగులో సాయికుమార్ , శర్వానంద్ లు నటించిన హిట్ చిత్రం ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ లో సంజయ్ దత్ మెడకు చుట్టుకుంది . తెలుగులో విజయవంతమైన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు . ఇక ఈ చిత్రానికి దర్శకుడు కూడా తెలుగు ప్రస్థానం కు దర్శకత్వం వహించిన దేవా కట్టా నే కావడం విశేషం .
అయితే ప్రస్థానం సినిమా రీమేక్ రైట్స్ మేము కొనుక్కున్నాం మీరెలా చేస్తారు ? అంటూ షీమారు ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సంజయ్ దత్ కు లీగల్ నోటీసులు పంపించింది . గతంలోనే సంజయ్ దత్ కు ఈ విషయాన్నీ చెప్పాలి కానీ పట్టించుకోలేదు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు . రీమేక్ లీగల్ గా ఇబ్బందులు వస్తుండటంతో దేవా కట్టా అసలు నిర్మాతల దగ్గర నుండి విషయం రాబట్టే పనిలో ఉన్నాడట ! మరి ఈ గొడవ దేనికి దారి తీస్తుందో చూడాలి .