క్యాన్సర్తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కోలుకున్నారు. ఆగస్టులో సంజయ్ క్యాన్స్ కారణంగా విరామం తీసుకున్న విషయం తెలిసిందే. సంజయ్ ఊపిరి తిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో కీమో థెరపి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో చేరిన సంజయ్ వారం తరువాత ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో తన తలపై మచ్చను చూపించాడు. తను త్వరలో క్యాన్సర్ నుండి బయటపడతానని నమ్మకంగా చెప్పాడు.
ఈ మధ్యాహ్నం సంజయ్ దత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సంజయ్ తన పిల్లలలో ఒకరి పుట్టినరోజు కావడంతో తను క్యాన్సర్ నుండి కోలుకున్నట్టు వెల్లడించారు. `గత కొన్ని వారాలు నాకు, నా కుటుంబానికి చాలా కష్టమైన సమయం. కొంత మంది చెప్పినట్లుగా దేవుడు బలమైన సైనికులకే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఈ రోజు నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ యుద్ధం నుండి విజయం సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. క్యాన్సర్ ను జయించి వారికి నేను ఉత్తమ బహుమతిని ఇవ్వగలిగాను`అని అన్నారు సంజయ్.
`మీ అందరి అచంచలమైన విశ్వాసం, మద్దతు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. ఈ ప్రయత్న సమయంలో నా కుటుంబానికి, స్నేహితులకు మరియు నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ నేను నిత్యం కృతజ్ఞుడనై వుంటాను` అని పేర్కొన్నారు సంజయ్దత్. తనకు చికిత్స చేసిన కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you ?? pic.twitter.com/81sGvWWpoe
— Sanjay Dutt (@duttsanjay) October 21, 2020