విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సంచలన చిత్రం `అర్జున్రెడ్డి`. సందీప్ వంగ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ గేమ్ ఛేంజర్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలో `కబీర్సింగ్` పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా సంచలనం సృష్టించింది. ఈ సినిమా తరువాత హిందీలో సందీప్ వంగ మరో చిత్రాన్ని చేయాలనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.
తెలుగులో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలనుకున్నారు. `డెవిల్` అనే టైటిల్ని కూడా ఫైనల్ చేసుకున్నారు. కానీ నాగ్ అశ్విన్తో ప్రభాస్ భారీ చిత్రాన్ని ప్రకటించడంతో సందీప్ వంగ సినిమా ఇక లేనట్టే అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సందీప్ వంగ అల్లూవారబ్బాయితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్గా మాసీవ్ పాత్రలో నటిస్తున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.