యంగ్ హీరో సందీప్ కిషన్ సారీ చెప్పాడు . ఇంతకీ ఈ హీరో సారీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ……. నటుడు ప్రియదర్శి బైక్ దొంగిలించబడింది అంటూ ట్వీట్ చేయడమే ! అయితే నిజంగానే నటుడు ప్రియదర్శి బైక్ పోయిందేమో అన్న టెన్షన్ అందరిలో నెలకొంది అంతేకాదు పోలీసులు కూడా స్పందించారు . దాంతో అది పెద్ద ఇష్యు కాకముందే ఆ ట్వీట్ ని డిలీట్ చేసాడు .
అయితే అలా ట్వీట్ చేయడానికి కారణం నిను వీడని నీడను నేను అనే సినిమా ప్రమోషన్ కోసం . ప్రియదర్శి కూడా నిను వీడని నీడను నేను చిత్రంలో నటించాడు . అయితే ప్రమోషన్ లో అతడు రాకపోవడంతో దాన్ని ఇలా వాడుకుందామనుకొని ట్వీట్ చేస్తే అది మరోలా అయ్యింది అందుకే సారీ చెప్పాడు సందీప్ కిషన్ . ఈనెల 12న సందీప్ కిషన్ హీరోగా నటించిన నిను వీడని నీడను నేను చిత్రం విడుదల కానుంది దాంతో టెన్షన్ గా ఉన్నాడు సందీప్ కిషన్ .
Sorry this got more serious than we expected..it’s a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene ..
As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film..
PS: I loved riding it ❤️
Love you Darshi boy ??? pic.twitter.com/sx6DbUN4Sh— #NVNN 12th July (@sundeepkishan) July 8, 2019