
హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న నాగ శౌర్య..తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకోగా..రేపు చిత్రంలోని ‘వర్షంలో వెన్నెల’ పాటను క్రేజీ బ్యూటీ సమంత విడుదల చేయబోతుంది.
రేపు శనివారం ఉదయం 11.09 గంటలకు లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ‘ఓ బేబీ’ సినిమాలో నాగశౌర్య – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో శౌర్య సినిమాకు తన వంతు సాయం చేయబోతుంది. ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటించగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.