అక్కినేని నాగ చైతన్య, సమంత తాము విడిపోతున్నట్లుగా అక్టోబర్ 2న సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేసిన సమంత ఇప్పటిదాకా మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అయితే ఈరోజు సమంత ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ లో శుక్రవారం జరగనున్న ఏక షో ను వీక్షించమని సమంత తన స్నేహితులకు, ఫ్యాన్స్ కు అప్పీల్ చేసింది. సమంత రీసెంట్ గా నెలకొల్పిన ఫ్యాషన్ బ్రాండ్ ఏక అన్న విషయం తెల్సిందే. అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ డివోర్స్ విషయాన్ని సింపుల్ గా చూడాలనుకుంటున్నారు. మీడియాలో ఇప్పటికే ఇద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దానికి బోలెడన్ని కారణాలను విశ్లేషించారు.
నాగ చైతన్య, సమంత మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేయకుండా తమ జీవితాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళీ తన సినిమాలను ప్రకటించనుంది. త్వరలోనే కొత్త చిత్రాలను సైన్ చేయనుంది సామ్. ఇక చైతన్య కెరీర్ కూడా సాఫీగా సాగుతోంది. లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన చైతూ హిందీలో ఆమిర్ ఖాన్ చిత్రం ద్వారా డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే.
View this post on Instagram