Homeగాసిప్స్క‌ష్టాల క‌డ‌లిలో `మ‌హాస‌ముద్రం`!

క‌ష్టాల క‌డ‌లిలో `మ‌హాస‌ముద్రం`!

క‌ష్టాల క‌డ‌లిలో `మ‌హాస‌ముద్రం`!
క‌ష్టాల క‌డ‌లిలో `మ‌హాస‌ముద్రం`!

యంగ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ద‌ర్శ‌కుడిగా అజ‌య్ భూప‌తికి, హీరోగా కార్తికేయ గుమ్మ‌కొండ‌కి, హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్‌కి మంచి పేరుని, క్రేజ్‌ని తెచ్చిపెట్టిన విష‌యం తెలిసిందే. క‌ల్ట్ ల‌వ్‌స్టోరీగా ఆకట్టుకున్నీ సినిమా త‌రువాత ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఎలాంటి సినిమా తీయ‌బోతున్నాడు?. ఆ సినిమా ఎలా వుంటుంది? అనే ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది.

దానికి అనుగుణంగానే అజ‌య్ భూప‌తి షాకింగ్ స్టోరీతో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. ముందు ఈ క‌థ‌ని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌కు వినిపించారు. క‌థ ఓకే అయింది. ఇక మ‌రో హీరో ఓకే చెప్ప‌డ‌మే ఆల‌స్యం సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డం ఖాయం అనే వార్త‌లు వినిపించాయి. `మ‌హాస‌ముద్రం` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఎక్క‌డో ఏదో జ‌రిగింది. ఈ సినిమా నుంచి ర‌వితేజ త‌ప్పుకున్నాడంటూ వార్త‌లు, ఆ త‌రువాత ఈ స్టోరీ నాగ‌చైత‌న్య వ‌ద్ద‌కు వెళ్లింది. అంతా ఓకే కానీ వ‌రుస ఫ్లాప్‌లు రావ‌డంతో చైతూ కూడా లైట్ తీసుకున్నాడు.

- Advertisement -

చివ‌రికి శ‌ర్వానంద్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఫైన‌ల్‌గా శ‌ర్వా ఓకే చెప్పాడు. హీరోయిన్‌గా స‌మంత‌ని అనుకున్నారు. మ‌రో హీరో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే ప‌ట్టాలెక్క‌డ‌మే త‌రువాయి… మ‌ళ్లీ సీన్ మారింది. ఈ సారి హీరో కాదు… హీరోయిన్ త‌ప్పుకుంది. `జాను` నిరాశ‌ప‌ర‌చ‌డంతో స‌మంత ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలిసింది. దీంతో అజ‌య్ భూప‌తి ప‌రిస్థితి మళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఈ క‌ష్టాల క‌డ‌లి నుంచి `మ‌హా స‌ముద్రం` బ‌య‌ట‌ప‌డ‌దా? అంటూ ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ మొద‌లైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All