యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం దర్శకుడిగా అజయ్ భూపతికి, హీరోగా కార్తికేయ గుమ్మకొండకి, హీరోయిన్గా పాయల్ రాజ్పుత్కి మంచి పేరుని, క్రేజ్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. కల్ట్ లవ్స్టోరీగా ఆకట్టుకున్నీ సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతి ఎలాంటి సినిమా తీయబోతున్నాడు?. ఆ సినిమా ఎలా వుంటుంది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
దానికి అనుగుణంగానే అజయ్ భూపతి షాకింగ్ స్టోరీతో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందు ఈ కథని మాస్ మహరాజా రవితేజకు వినిపించారు. కథ ఓకే అయింది. ఇక మరో హీరో ఓకే చెప్పడమే ఆలస్యం సినిమా సెట్స్పైకి వెళ్లడం ఖాయం అనే వార్తలు వినిపించాయి. `మహాసముద్రం` అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఈ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నాడంటూ వార్తలు, ఆ తరువాత ఈ స్టోరీ నాగచైతన్య వద్దకు వెళ్లింది. అంతా ఓకే కానీ వరుస ఫ్లాప్లు రావడంతో చైతూ కూడా లైట్ తీసుకున్నాడు.
చివరికి శర్వానంద్ వద్దకు వచ్చింది. ఫైనల్గా శర్వా ఓకే చెప్పాడు. హీరోయిన్గా సమంతని అనుకున్నారు. మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే పట్టాలెక్కడమే తరువాయి… మళ్లీ సీన్ మారింది. ఈ సారి హీరో కాదు… హీరోయిన్ తప్పుకుంది. `జాను` నిరాశపరచడంతో సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. దీంతో అజయ్ భూపతి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కష్టాల కడలి నుంచి `మహా సముద్రం` బయటపడదా? అంటూ ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ మొదలైంది.