సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత యమ యాక్టీవ్గా వుంటుంటారు. ఏ చిన్న విషయాన్నికూడా వదలకుండా అభిమానులతో పంచుకుంటుంటారు. లాక్డౌన్ సమయంలో డాబాపై వ్యవసాయం పేరుతో వెజిటెబుల్స్ పండించి ఆశ్చర్యపరిచిన సమంత సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయింది. అలాగే సాకి పేరుతో ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసిన సామ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్లో ‘పోస్ట్ ఎ పిక్చర్’ చేరారు.
నటి సమంతా ఇన్స్టాగ్రామ్ ‘పోస్ట్ ఎ పిక్చర్’ ట్రెండ్లో నిలిచారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్తో పాటు తన అభిమానులు చూడాలనుకుంటున్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఓ అభిమాని మాత్రం సామ్ని ‘చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్’ పోస్ట్ చేయమని అడిగాడట. దీంతో సమంత ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నాగచైతన్య కొన్ని చెక్క ముక్కలపై తనను తాను బ్యాలెన్స్ చేసుకుని వాటిపై పడుకుని కనిపించాడు.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నాగ చైతన్య కొన్ని చెక్క ముక్కలపై పడుకున్నట్లు, అతని పాదాలు, వీపు, చేతులు మరియు తల మాత్రమే చెక్కపై ఉంచినట్లు ఈ చిత్రం చూపిస్తోంది. చైతన్య మెడిటేషన్లో ప్రావీణ్యం సంపాదించాడని ఈ ఫొటోతో అర్థమవుతోంది. సమంత మరికొన్ని ఆహ్లాదకరమైన చిరస్మరణీయ చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఇవన్నీ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.