
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతాపై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్తో పాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్ .. ఇలా ఏదో ఒకరకంగా సామ్ నేమ్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. అయితే సామ్ మాత్రం ఇవన్ని లైట్ తీసుకుంది. తనపై వచ్చే పుకార్లకు స్పందించడం లేదు. అంతేకాదు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొంత కాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, అందుకే ఆమె బయటకు రావడం లేదనేది ఆ వార్త సారాంశం. దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేనేజర్ స్పందించాడు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సమంతకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. కొంతమంది కావాలనే తప్పులు వార్తలు సృష్టిస్తున్నారని, వారిపై సమంత లీగల్ యాక్షన్ తీసుకునే చాన్స్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఈ నెలాఖరులో షూటింగ్లో పాల్గొనబోతున్నారని చెప్పారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే… ఆమె నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే..
ప్రస్తుతం యశోధ, ఖుషి చిత్రాల షూటింగ్స్లో పాల్గోంటూ తెగ బిజీ అయిపోయింది సామ్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత ఆసక్తిని పెంచాయి. బాలీవుడ్లో సామ్ బిజీ కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీ ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి. అందులో ఓ వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈ సిరీస్ కోసం సామ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కాకుండా మరో మూవీలో సమంత నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో జానపద కథతో రాబోతున్న ఈ సినిమాలో సామ్ ద్విపాత్రాభినయం చేయబోతుంది. ఇందులో ఒకటి రాజ్ పుత్ రాణిగా.. మరొకటి ఆత్మగా నటిస్తుంది. అయితే ఆత్మగా నటించడం అనేది సమంతకు కొత్తేమి కాదు. గతంలోనూ రాజు గారి గది 2లో సామ్ ఆత్మగా నటించింది. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేదు.