సల్మాన్ఖాన్ నటించిన తాజా చిత్రం `దబాంగ్ 3`. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ఖాన్ నటించి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని సల్మాన్ భావించిన ఈ చిత్రం అతని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. దీంతో షాక్కు గురైన సల్మాన్ఖాన్ ఈ సినిమా రిలీజ్కు ముందే మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. `రాధే` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికీ దర్శకుడు ప్రభుదేవానే.
`యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` అని ట్యాగ్ లైన్. సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రిలతో కలిసి సల్మాన్ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిషా పటాని హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలోకి క్లైమాక్స్ సన్నివేశాల కోసం సల్మాన్ ఏకంగా 8 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఇది బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
`బాహుబలి` పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలని లండన్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ ఎక్స్ సంస్థ రూపొందించింది. `రాధే` క్లైమాక్స్ సన్నివేశాలకు కూడా అదే సంస్థ చేత గ్రాఫిక్స్ చేయిస్తున్నారట. ఈ సన్నివేశం 20 నిమిషాల పాటు వుంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసం 8 కోట్లు ఖర్చు చేస్తుండటం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.