Homeటాప్ స్టోరీస్సుశాంత్ అభిమానుల తిట్లను పట్టించుకోకండి : సల్మాన్ ఖాన్

సుశాంత్ అభిమానుల తిట్లను పట్టించుకోకండి : సల్మాన్ ఖాన్

సుశాంత్ అభిమానుల తిట్లను పట్టించుకోకండి : సల్మాన్ ఖాన్
సుశాంత్ అభిమానుల తిట్లను పట్టించుకోకండి : సల్మాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో అంతర్గతంగా నాటుకుపోయిన రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు అన్నీ మరొకసారి బయటకు వచ్చినట్లైంది. ఈ విషయమ్మీద ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తోన్న విషయం తెల్సిందే. సుశాంత్ ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ లో కొందరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా నేపోటిజం అన్నది పెద్ద చర్చకు మరోసారి వచ్చింది.

బాలీవుడ్ లో పేరున్న ప్రముఖులైన సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లకు సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. వారి అకౌంట్ల నుండి లక్షల్లో ఫ్యాన్స్ తప్పుకుంటున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక అకౌంట్ ను డిజేబుల్ చేసుకున్న విషయం తెల్సిందే.

- Advertisement -

రీసెంట్ గా సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ కు, సల్మాన్ ఫ్యాన్స్ కు మధ్య మినీ యుద్ధమే సాగింది. ఈ విషయం చేయిదాటిపోతోందని గ్రహించిన సల్మాన్ ఖాన్.. ఈ వ్యవహారంపై ఓపెన్ గానే స్పందించాడు. సుశాంత్ ఫ్యాన్స్ తనను అంటున్న మాటలను పట్టించుకోకుండా వారి బాధను అర్ధం చేసుకోవాలని, తిరిగి ఏమీ అనవద్దని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు. వేడి తగ్గేవరకూ వేచి చూడటం ఉత్తమమని, అప్పటి దాకా తన ఫ్యాన్స్ సంయమనంపాటించాలని, సుశాంత్ ఫ్యాన్స్ ను ఏం అనవద్దని తెలిపాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All