కోయంబత్తూరు చిన్నది సాయి పల్లవి `ప్రేమమ్` సినిమాతో మలర్గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి తెలుగులోకి `ఫిదా` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి దక్షిణ భారతదేశం అంతటా అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఓ పక్క సారంగ దరియా అంటూ `లవ్స్టోరీ`తో .. కోలు కోలు కోలన్న కోలు.. అంటూ `విరాటపర్వం`తో యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది.
త్వరలో ఈ రెండు చిత్రాలు థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించబోతున్నాయి. ఇదిలా వుంటే సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ముమ్మూర్తులా సాయి పల్లవిలా వుండే పూజా కన్నన్ ఇటీవల నటిగా తన తొలి చిత్రానికి సంతకం చేసింది. కోలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్ ‘స్టంట్’ సిల్వా పూజా ప్రధాన పాత్రలో నటించే చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే `తలైవి` ఫేమ్ ఎఎల్ విజయ్ అందించనున్నారు. యాదృచ్ఛికంగా పూజా AL విజయ్ వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే సాయి పల్లవి విజయ్ `కరు` (తెలుగులో కనమ్) లో నటించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, స్టంట్ సిల్వా కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారుచబోతున్నారు. పూజా దాదాపు 5 సంవత్సరాల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.