స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దేవాదాయ భూముల స్కాం నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్రెడ్డి, రామ్చరణఫ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి దర్శకుడు కొరటాల శివ స్పీడు పెంచారు. గత పది నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ఓ భారీ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. `ఆచార్య` చిత్రీకరణలో వుండగానే బన్నీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని స్టార్ట్ చేసినట్టు తెలిసింది. బన్నీ నటిస్తున్న `పుష్ప` చిత్రీకరణ దశలో వుండగానే కొరటాల తనతో చేయనున్న చిత్రానికి సంబంధించిన కీలక కార్యక్రమాలు స్టార్ట్ చేశారట.
ఈ ఏడాది సెకండ్ హాఫ్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ఎంపిక పనుల్ని మొదలుపెట్టారట. ఇందులో భాగంగా బన్నీకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సయీ మంజ్రేకర్ ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న `మేజర్`లో నటిస్తోంది.