Homeటాప్ స్టోరీస్ప్రభాస్ పెళ్లి ఫై ఫస్ట్ టైం స్పందించిన కృష్ణం రాజు కూతురు

ప్రభాస్ పెళ్లి ఫై ఫస్ట్ టైం స్పందించిన కృష్ణం రాజు కూతురు

sai praseeda about prabhas marriage
sai praseeda about prabhas marriage

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కెరియర్ ను జెట్ స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉండిపోతున్నాడు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో..అనుకుంటూ అభిమానులు ఏళ్లు గడుపుతున్నప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించడం లేదు.

ఇదే తరుణంలో ప్రభాస్ ..అనుష్క ను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలను కృష్ణం రాజు భార్య శ్యామ‌ల దేవి ఖండించిన సంగతి తెలిసిందే. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ‘ప్రభాస్‌కి మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలంటే ఎంతో గౌర‌వం ఉంది. మ‌హిళంటే గౌర‌వం ఉంది. కుటుంబానికి.. ఇంటి పెద్ద‌ల‌కు గౌర‌వం ఇస్తారు. ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా ఉన్నారు ’’ అని తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉంటె తాజాగా కృష్ణం రాజు కూతురు సాయి ప్రసీద స్పందించింది. రాధే శ్యామ్ నిర్మాతగా తన అనుభవాన్ని చెబుతూ పర్సనల్ విషయాలను పంచుకుంటూ ..ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడింది.వదినని తీసుకురమ్మని ప్రభాస్ అన్నయ్యకి ఎప్పుడూ చెప్పలేదు..ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే హ్యాపీ అని ప్రసీద చెప్పుకొచ్చింది. ఇక సాయి ప్రసీద రాధే శ్యామ్ నిర్మాతల్లో ఒకరినే సంగతి తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All