నేను పెళ్లి చేసుకోను , పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మానాన్న లను ఎవరు చూసుకుంటారు అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది హీరోయిన్ సాయి పల్లవి . ఈ భామ పై పలు పుకార్లు షికారు చేస్తున్న ఈ తరుణంలో నేను పెళ్లి చేసుకోను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది . తెలుగులో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామకు ఆ తర్వాత అంతగా సక్సెస్ లు దక్కలేదు .
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటిస్తోంది ఈ భామ . అయితే తమిళంలో ఈ భామకు అంతగా విజయాలు దక్కడం లేదు . ఇక తెలుగులో కూడా పరాజయాలే పలకరిస్తున్నాయి దాంతో ఇక సాయి పల్లవి పెళ్లి చేసుకోవడం ఖాయమని పుకార్లు వస్తున్నాయి . ఇవి సాయి పల్లవి చెవిన పడటంతో నేను అసలు పెళ్లే చేసుకోను , పెళ్లి చేసుకుంటే మా అమ్మానాన్న లను ఎవరు చూసుకుంటారు అంటూ తింగరి ప్రశ్న వేస్తోంది .