నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `లవ్స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. 15 రోజుల్లో ఈ మూవీ చివరి షెడ్యూల్ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అయితే కీలక ఘట్టాన్ని రీ షూట్ చేయాలని దర్శకుడు శేఖర్ కమ్ముల భావిస్తున్నారట.
ఇలా శేఖర్ కమ్ముల రీషూట్కి వెళుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సీన్లని నాగచైతన్యతో పాటు సాయి పల్లవిపై చిత్రీకరించాల్సి వుందట. ఇందు కోసం సాయి పల్లవి రెండు వారాల పాటు డేట్స్ కేటాయించాల్సి వుంటుందట. ఇందుకు ఆమె అంగీకరిస్తుందా? అని అనుమానించిన శేఖర్ కమ్ముల డేట్స్ విషయంలో సాయి పల్లవిని రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది.
తనకు తెలుగు ఇండస్ట్రీలో `ఫిదా`తో బ్లాక్ బస్టర్ హిట్ని అందించిన దర్శకుడు కావడంతో మరో మాట మాట్లాడకుండా సాయి పల్లవి రెండు వారాల పాటు డేట్స్ ని కేటాయించినట్టు తెలిసింది. ప్రస్తుతం సాయి పల్లవి, నాగ చైతన్య పాల్గొనగా షూటింగ్ చేస్తున్నారట. ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో రావు రమేష్, పోసాని నటిస్తున్నారు.