డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది చెబుతుంటారు. కానీ నేచురల్ యాక్టర్ సాయిపల్లవి మాత్రం డాక్టర్గా ప్రయత్నించి యాక్టర్ అయ్యింది. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చదివారు. ఆ తరువాత భారత్లో నిర్వహించే కీలక పరీక్షలో మాత్రం పాల్గొనలేదు . తాజాగా ఆ పనిని కూడా పూర్తి చేశారు సాయి పల్లవి. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే వైద్య విధ్యలో రాణించాలని ప్రయత్నాలు చేస్తున్న ఆమె మొత్తానికి సాధించారు.
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించినా స్వదేశంలో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షలో తప్పకుండా పాస్ కావాల్సి వుంటుంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డ్ ఆప్ ఎగ్జామినేషన్ నిర్వహించే పరీక్షల్లో పాల్గొంది. ఫిరిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMGE) పరీక్షకు హాజరయ్యారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్లో డాక్టర్గా నమోదు చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పని సరిగా నమోదు ఉత్తీర్ణులు కావాలి.
ఈ నేపథ్యంలో తిరుచి లోని Mam కాలేజీలో ఈ పరీక్షకు సాయి పల్లవి హాజరయ్యారు. ఈ విషయాన్ని చాలా స్టైల్గా సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి వెల్లడించారు. `సాయి పల్లవి గారు తిరుచ్చిలోని Mam కాలేజీలో FMGE ఎక్జామ్ రాశారు` అని సాయి పల్లవివ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సాయి పల్లవి `విరాటపర్వం` చిత్రంలో నటిస్తున్న వియం తెలిసిందే.