లాక్డౌన్ ఏమోగాని ఈ సమయాన్ని టాలీవుడ్ స్టార్స్ బాగానే వినియోగించుకుంటున్నారు. కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారైపోతే టాలీవుడ్లో మాత్రం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లి మాటెత్తితే సమాధానం దాటవేస్తూ సంబంధం లేని సమాధం చెప్పే స్టార్స్ అంతా సడన్గా పెళ్లికి రెడీ అయిపోయారు. దిల్ రాజు నుంచి మొదలైన ఈ పెళ్లిళ్ల హంగామా కంటిన్యూ అవుతూనే వుంది.
ఇటీవల మెగా డాటర్ నిహారిక వివాహం జరిగిన విషయం తెలిసిందే. లవ్ నుంచి ఆ తరువాత అరేంజ్డ్ మ్యారేజ్గా మారిన నిహారిక, చైతన్యల వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ తన పెళ్లెప్పుడంటే ప్రతీ సారి కొత్త లాజిక్ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇంత కాలం నిహారిక పెళ్లి తరువాతే తన పెళ్లంటూ చెప్పుకొచ్చిన సాయిధరమ్తేజ్ తాజాగా నిహారిక పెళ్లైపోవడంతో కొత్త లాజిక్ వినిపించి షాకిస్తున్నాడు.
పెళ్లికి ఇంకా ఐదేళ్లు పడుతుందని చెబుతున్న సాయిధరమ్తేజ్ తన పెళ్లి శిరీష్ పెళ్లి తరువాతే అని కొత్త మెలిక పెడుతున్నాడు. తన కంటే శిరీష్ పెద్దవాడని, అతని పెళ్లి తరువాతే తాను పెళ్లి చేసుకుంటానని కొత్త లాజిక్ వినిపిస్తున్నాడు. అయితే లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని, లవ్ ఎఫైర్లు పెట్టుకోనని చెబుతున్నాడు. ఇదిలా వుంటే సాయిధరమ్తేజ్ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతోంది.