Homeటాప్ స్టోరీస్సాయిధ‌ర‌మ్‌తేజ్ మిస్టి‌క‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం!

సాయిధ‌ర‌మ్‌తేజ్ మిస్టి‌క‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం!

సాయిధ‌ర‌మ్‌తేజ్ మిస్టి‌క‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం!
సాయిధ‌ర‌మ్‌తేజ్ మిస్టి‌క‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం!

మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీడు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో జోరు పెంచారు. ఈ మెగా మేన‌ల్లుడు న‌టించిన తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోలో బెట‌ర్‌` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే సాయిధ‌ర‌మ్‌తేజ్ గురువారం మ‌రో చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. SDT 15గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్స‌వం సంస్థ కార్యాల‌యంలో జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం దేవుని చిత్ర ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయిధ‌ర‌మ్‌తేజ్ క్లాప్ నిచ్చారు. డైరెక్ట‌ర్ సుకుమార్ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విఛాన్ చేశారు.

- Advertisement -

నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు కార్తీక్ దండుకు స్క్రిప్ట్‌ని అందించారు. మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All