మెగా హీరో సాయిధరమ్తేజ్ స్పీడు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచారు. ఈ మెగా మేనల్లుడు నటించిన తాజా చిత్రం `సోలో బ్రతుకే సోలో బెటర్` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే సాయిధరమ్తేజ్ గురువారం మరో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. SDT 15గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయిధరమ్తేజ్ క్లాప్ నిచ్చారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విఛాన్ చేశారు.
నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ దర్శకుడు కార్తీక్ దండుకు స్క్రిప్ట్ని అందించారు. మిస్టికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేయనున్నారు.