మంచు హీరోలకు, మెగా హీరోలకు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్కింగ్ మోహన్బాబు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత బన్నీతో కలిసి మంచు మనోజ్ నటించిన `వేదం` మంచి విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మరోసారి మంచు హీరో, మెగా హీరో కలబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంత విరామం తరువాత మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం `అహం బ్రహ్మస్మి`. మంచు మనోజ్ ఆర్ట్స్ బ్యానర్పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. మంచు నిర్మలా దేవి, మంచు మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
ఇందులో మంచు మనోజ్ విభిన్నమైన లుక్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక అతిథి పాత్రలో మెగా హీరో సాయి ధరమ్తేజ్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా మంచు మనోజ్తో సాయి ధరమ్తేజ్ కు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆ కారణంగానే సాయి ధరమ్తేజ్ ఈ చిత్రంలోని అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించారని వినిపిస్తోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.