హైదరాబాద్ వీధుల్లో తమిళ స్టార్ హీరో అజిత్ సైకిల్ పై రైడింగ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోగా హైదరాబాద్ రోడ్లపై బైక్పై సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ హీరో మరెవరో కాదు యంగ్ మెగా హీరో సాయి ధరమ్తేజ్. ఇటీవల ముంబై రోడ్లపై కాస్ట్లీ బైక్ ఆర్ ఆర్ పై రైడ్ చేసి సందడి చేసిన సాయి ధరమ్తేజ్ ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై కూడా సందడి చేస్తున్నారు.
లక్షలు విలువ చేసే లగ్జరీ బైక్పై హైదరాబాద్ వీధుల్లోనూ సాయిధరమ్తేజ్ సందడి చేస్తున్నారు. మండే రోజు జూబ్లీ హిల్స్ నుంచి మాధాపూర్ వరకు బైక్ రైడింగ్ చేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రేసర్లా ట్రాక్ సూట్ ధరించి.. తనెవరో తెలియకుండా.. తనని గుర్తు పట్టకుండా ఫేస్కి హెల్మెట్ పెట్టుకుని నగర వీధుల్లో చక్కర్లు కొట్టడం ఆకట్టుకుంటోంది.
సాయి ధరమ్తేజ్ ప్రస్తుతం దేవా కట్టా తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`లో నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె. పుల్లారావు, భగవాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీపై సాయి ధరమ్తేజ్ భారీ అంచనాలే పెట్టుకున్నారట.