Homeటాప్ స్టోరీస్13.5 కోట్లకు అమ్ముడైన "సాక్ష్యం" శాటిలైట్ రైట్స్

13.5 కోట్లకు అమ్ముడైన “సాక్ష్యం” శాటిలైట్ రైట్స్

sakshyamశ్రీవాస్ – బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న “సాక్ష్యం” తాజా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా.. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు (తెలుగు, హిందీ) 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం మార్కెట్ లో విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. జీ సంస్థ “సాక్ష్యం” తెలుగు శాటిలైట్ హక్కుల్ని తెలుగు-5.5 కోట్లు, హిందీ-8 కోట్ల రూపాయలకు కొనడం విశేషం.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ కు కూడా విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్స్ వేసి షూటింగ్ జరుగుతోంది. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా అభినేష్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఓ యువ హీరో చిత్రానికి ఈస్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరగడం అనేది ఇదే మొదటిసారి. చిత్రబృందం ఆఖరి షెడ్యూల్ కోసం త్వరలో అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో చిత్రించబోయే కీలక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తవుతుంది. మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న “సాక్ష్యం” ష్యూర్ షాట్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All