నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం `అఖండ`. హై వోల్టేజ్ ఊరమాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలోని ఓ పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నారు. అందుకు సంబంధించిన టీజర్తో పాటు మూవీ టైటిల్ని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. కొంత ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ ఈ నెలఖరుతో పూర్తి కానుంది. ఇదిలా వుంటే ఇటీవల విడుదల చేసిన టీజర్ యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే 37 ప్లస్ మిలియన్ వ్యూస్ని దాటి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఐఏ ఎస్ ఆఫీసర్గానూ, అఘోరాగానూ బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం 65 కోట్లు ఆఫర్ లభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ని బోయపాటి ఫైనల్ చేస్తారో లేక మరి కొంత డిమాండ్ పెరిగే వరకు వేచి చూస్తారో చూడాలి. కాగా ఈ మూవీని మే 28న వరల్డ్ వైడ్గా విడుదల చేయబోతున్నారు.