ఆకాష్ పూరీ, కెతిక శర్మ జంటగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్టోబర్ 29న రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో డైరక్టర్ అనీల్ పాదూరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. స్వతహాగా పెయింటర్ అయిన తాను డైరక్షన్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు అనీల్.
విజువల్ ఎఫెక్ట్స్ లో దాదాపు 11 సినిమాల దాకా పనిచేయగా ఒకసారి పూరీ సర్ వచ్చి తన కథను డైరెక్ట్ చేయమని అడిగారని చెప్పారు. ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేంత వరకు దర్శకత్వ శాఖలో పనిచేయలేదు.. స్క్రిప్ట్ పేపర్ పట్టుకోలేదు. కాని తన మీద నమ్మకంతో పూరీ సర్ ఈ అవకాశం ఇచ్చారని అన్నారు అనీల్ పాదూరి. ఇక ఈ సినిమా కథకు ముందు సైనోరిటా టైటిల్ అనుకున్నామని ఆ తర్వాత రొమాంటిక్ గా మార్చామని చెప్పారు.
సినిమా చూసి పూరీ సర్ కళ్లలో నీళ్లు వచ్చాయని అన్నారు. సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తూనే ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎమోషన్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి అనీల్ పాదూరి మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.