Homeటాప్ స్టోరీస్దూసుకుపోతున్న వ‌ర్మ, శ్రేయాస్ ఈటీ ATT!

దూసుకుపోతున్న వ‌ర్మ, శ్రేయాస్ ఈటీ ATT!

దూసుకుపోతున్న వ‌ర్మ, శ్రేయాస్ ఈటీ ATT!
దూసుకుపోతున్న వ‌ర్మ, శ్రేయాస్ ఈటీ ATT!

ఓటీటీల‌తో భిన్నంగా వ‌ర్మ తెర‌పైకి తీసుకువ‌చ్చిన డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ATT (ఎనీ టైమ్ థియేట‌ర్‌). క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా థీయేట‌ర్లు తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి. ఎప్పుడు తెరుస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని కొత్త మాధ్య‌మం ద్వారా అందించాల‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ ATT (ఎనీ టైమ్ థియేట‌ర్‌)ని తెర‌పైకి తీసుకొచ్చారు.

శ్రేయాస్ ఈటీతో క‌లిసి వ‌ర్మ క్లైమాక్స్‌, నేక్డ్ (న‌గ్నం) వంటి చిత్రాల్ని అందించారు. త్వ‌ర‌లో మ‌ర్డ‌ర్‌, థ్రిల్ల‌ర్‌, 12 ఓ క్లాక్ వంటి చిత్రాలని అందించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు RGV World theatre, శ్రేయాస్ ఈటీలో విడుద‌లైన రెండు చిత్రాలు ఊహించిన దానికి మించి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సాధిచాయి. ఇదే కోవ‌లో మ‌రో థ్రిల్ల‌ర్ సినిమా ఈ యాప్‌ల‌లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

భ‌వికా దేశాయ్ , వెన్నెల కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, తాగుబోతు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `302`. `ది ట్రూ స్టోరీ ఆఫ్ రియ‌ల్ ఫేక్‌` అని క్యాప్ష‌న్‌. చాలా కాలంగా రిలీజ్‌కు నోచుకోని ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీలో రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ మిర్యాల ద‌ర్శ‌కుడు. అవినాష్ సుంద‌ర‌ప‌ల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుంది. క్రైమ్, కామెడీ, స‌స్పెన్స్‌తో పాటు హార‌ర్ అంశాల మేళ‌వింపుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు, ఒక అమ్మాయి చుట్టూ ఒక్క రోజులో జ‌రిగే క‌థ ఇద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All