`అర్జున్రెడ్డి` ఫేమ్ సందీప్రెడ్డి వంగ `బి ద రియల్మెన్ ` ఛాలెంజ్ని మొదలుపెట్టి రాజమౌళిని నామినేట్ చేయడం, తరువాత ఆయన దీన్ని వైరల్ చేయడంతో టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఛాలెంజ్లో రాజమౌళి, చిరంజీవి, ఎన్టీఆర్, రామ్చరణ్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, సుకుమార్, దేవిశ్రీప్రసాద్తో పాటు చాలా మందే పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్పై వ్యంగ్యంగా సెటైర్ వేశారు రామ్గోపాల్వర్మ.
`సినిమా పరిశ్రమకు చెందిన మిగతా వారంతా ఇళ్లు తుడవడం, వంటి చేయడం, బట్టలు ఉతకడం.. వంటివి చేస్తే నేను మాత్రం ఓ సినిమా తెరకెక్కించా` అని కండలు చూపిస్తున్న ఎమోజీలని చూపిస్తూ వర్మ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతుంటే వర్మ మాత్రం దానిపైనే సినిమబా తీసి అవాక్కయ్యేలా చేశారు.
తాజాగా అగస్త్య మంజు దర్శకత్వంలో వర్మ నిర్మించిన `కరోనా వైరస్` త్వరలోనే విడుదల కానుంది. ఈ మంగళవారం రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యావత్ ప్రపంచం లాక్డౌన్లో వుండగా వర్మ ఇన్డోర్లో, కేవలం ఒక ఇంటిలో తన సినిమాని పూర్తి చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.