మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. అక్టోబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. బైక్ యాక్సిడెంట్ కారణంగా హీరో సాయి ధరం తేజ్ ఈవెంట్ కు హాజరు కాలేదు. అయితే సాయి ధరం తేజ్ కు సపోర్ట్ గా రిపబ్లిక్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు.
పవర్ ఫుల్ సినిమా ఈవెంట్ లో పవర్ ఫుల్ స్పీచ్ తో ప్రేక్షకులను అలరించారు పవన్ కళ్యాణ్. పనిలో పనిగా సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ ఎపిసోడ్ పై మీడియా చేసిన అతిని కడిగిపారేశాడు పవన్ కళ్యాణ్. సాయి ధరం తేజ్ బైక్ యాక్సిడెంట్ మీద మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేసింది. 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో అంటూ వెటకారంగా మీడియా ప్రసారం చేసిన వార్తలపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే నేను చెబుతానని అనారు పవన్ కళ్యాణ్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కథనాలు రాయండి..? ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కోడి కత్తి దాడి గురించి వార్తలు రాయండి..? ఆరేళ్ల చిన్నారి చైత్ర మీద జరిగిన అమానుషమైన హత్య ఘటన గురించి వార్తలు రాయండి. రాజకీయ నాయకుల దోపిడీ ల మీద కథనాలు రాయండి. సినిమా వాళ్లైతే ఏమి అనరు కాబట్టి వారిని టార్గెట్ చేస్తున్నారంటూ మీడియాపై తన మనసులో మాటని రిపబ్లిక్ వేదిక మీద బయట పెట్టారు పవన్ కళ్యాణ్.