Homeటాప్ స్టోరీస్పింక్ రీమేక్ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్

పింక్ రీమేక్ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్

పింక్ రీమేక్ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్
పింక్ రీమేక్ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. రీ ఎంట్రీ ఫిల్మ్ గా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ ను చూజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ లోని 40 శాతాన్ని పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన రాజకీయ కారణాలతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన పవన్ త్వరలోనే మళ్ళీ ముఖానికి రంగు వేసుకోనున్నాడు. పింక్ రీమేక్ తో పాటు క్రిష్ సినిమాను కూడా చేస్తున్న విషయం తెల్సిందే.

ఇది పక్కన పెడితే రేణు దేశాయ్ ఇటీవలే తన బేస్ ను తిరిగి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్న విషయాన్ని ధృవీకరించిన విషయం తెల్సిందే. రేణు దేశాయ్ అనగానే ఆటొమ్యాటిగ్గా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చి తీరుతుంది. కొన్ని సార్లు ఈ విషయంలో రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసినా సరే వార్తలు మాత్రం ఆగడం లేదు.

- Advertisement -

రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాగానే అపార్ట్మెంట్ కొనిపెట్టారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఫైర్ అయిన విషయం తెల్సిందే. తను స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడుతున్నానని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొద్దని ఆమె కోరింది. ఇదే నేపథ్యంలో గత కొంత కాలం నుండి పింక్ రీమేక్ లో రేణు దేశాయ్ నటిస్తున్నారంటూ కొన్ని వార్తలు షికార్లు చేసాయి. సినిమా కథలో భాగంగా ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకం. అందులో ఒక అమ్మాయి పాత్రకు నివేత థామస్, మరో పాత్రకు అంజలి, మూడో పాత్రకు రేణు ఎంపికైనట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెను ఒక అభిమాని మీరు పింక్ రీమేక్ లో నటిస్తున్నారటగా అని ప్రశ్నించగా, దానికి ఆమె బదులిస్తూ లేదండి, అది జస్ట్ ఫాల్స్ న్యూస్ అని సమాధానమిచ్చింది. దీంతో పింక్ రీమేక్ లో రేణు అని ఆశలు పెట్టుకున్న పవన్ అభిమానులకు నిరాశే ఎదురైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All