పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `బద్రి`. పూరి జగన్నాథ్ డైరెక్టర్గా అరంగేట్రం చేసిన ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా 21 ఏళ్లు. ఈ మూవీతో రేణు దేశాయ్ హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. పూరి, పవన్, రేణుదేశాయ్, అమీషా పటేల్ల కెరీర్ని ఓ మలుపు తిప్పిన చిత్రమిది.
విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై టి. త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలోని `హే చికిత్తా.. , బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే.. ఐ యామ్ ఇండియన్ .. వంటి గీతాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే వున్నాయి.
ఈ మూవీ ద్వారా హీరోయిన్గా పరిచయమైన రేణు దేశాయ్ `బద్రి` 21 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. `హే చికిత్తా.. పాటలో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్లో పవన్కల్యాణ్ వుండగా అతని ముందు దుప్పట్టా కప్పుకుని తను వున్న ఫొటోని రేణు దేశాయ్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకి మెమోరీస్ ఫర్ లైఫ్ అని ట్యాగ్ ఇచ్చారు.
View this post on Instagram