పవన్కల్యాణ్ నటించిన `బద్రి` చిత్రంతో రేణుదేశాయ్ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత `జానీ`లో నటించిన ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. పవన్ని వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేశారామె. అయితే ఇటీవల పవన్తో విడాకులు తీసుకోవడంతో పూనే వెళ్లిపోయిన రేణూ దేశాయ్ అప్పుడప్పుడు రియాలిటీ షోస్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
మరాఠీలో ఓ సినిమా కూడా చేసిన రేణూ దేశాయ్ త్వరలో తెలుగులో సోలోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఆమెకు మదర్ పాత్రలో నటించే ఆఫర్ ఇచ్చారని తెలిసింది. `పెళ్లిచూపులు` చిత్రాన్ని నిర్మించి ఈ సినిమాతో మంచి గుర్తింపుని పొందిన రాజ్ కందుకూరి తన తనయుడు శివని హీరోగా పరిచయం చేస్తూ `చూసి చూడంగానే` అనే అ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో శివకు తల్లిగా కీలక పాత్రలో నటించమని రేణూ దేశాయ్ని అడిగారట. ఆ సమయంలో అనారోగ్యంగా వుండటం వల్ల ఆ సినిమా అంగీకరించలేదని, అయితే అతని లాంటి నిర్మాతలు అవకాశాలిస్తే మాత్రం తను కచ్చితంగా నటిస్తానని రేణూ దేశాయ్ ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో చెప్పడం ఆసక్తికరంగా మారింది.